Temparature: భగ్గుమన్న భానుడు
ABN , Publish Date - May 09 , 2025 | 11:33 PM
High temperatures in summer జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోయారు. మైదాన ప్రాంతాల్లో ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేసింది.

జిల్లాలో తీవ్ర వడగాల్పులు
ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు
శ్రీకాకుళం, మే 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోయారు. మైదాన ప్రాంతాల్లో ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేసింది. మూడు మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచాయి. శుక్రవారం మధ్యాహ్నానికి బూర్జ, హిరమండలం, మెళియాపుట్టి, పొందూరు, సారవకోట మండలాల్లో నిప్పులు కురిసినట్లుగా వాతావరణం మారింది. వేడిగాలులు భరించలేక.. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు ఆపసోపాలు పడ్డారు. ఈనెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు ఇదేరీతిన పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. మిట్ట మధ్యాహ్నం భానుడి కర్ఫ్యూ అన్నట్లు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
శుక్రవారం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో)
-----------------------
మెళియాపుట్టి 40.0
పాతపట్నం 40.0
హిరమండలం 40.2
సారవకోట 40.3
పొందూరు 40.6
బూర్జ 40.7