Share News

జీఎస్టీ తగ్గింపు దేశ ప్రజలకు గొప్ప కానుక

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:25 PM

జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు ఎంతో ఊరట కలిగించిందని బీజేపీ జిల్లా అధ్య క్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు.

జీఎస్టీ తగ్గింపు దేశ ప్రజలకు గొప్ప కానుక
ప్రధాని మోదీ చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న బీజేపీ నేతలు

శ్రీకాకుళం రూరల్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు ఎంతో ఊరట కలిగించిందని బీజేపీ జిల్లా అధ్య క్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శనివారం అరసవల్లి మిల్లు జంక్షన్‌లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకు రాలు శవ్వాన ఉమా మహేశ్వరి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కటౌ ట్లకు క్షీరాభిషేకం చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టు కున్నారన్నారు. కోట్లాది మంది మధ్య తరగతి ప్రజలకు దసరా, దీపావళి కానుక అంద జేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పైడి సింధూర, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:25 PM