Share News

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: శిరీష

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:59 PM

మారుమూల పల్లెల్లో సైతం విద్యా భివృద్ధికి ప్రభుత్వం కృషివేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమ వారం హరిపురం ప్లస్‌ టూ హైస్కూల్‌లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, మాధవరావు, రుద్రయ్య, గున్నయ్య, వాసు, వైకుంఠరావు, తమిరి భాస్కరరావు, లచ్చయ్య పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: శిరీష
పలాస: రోడ్డు పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష:

హరిపురం, డిసెంబరు15 (ఆంధ్రజ్యోతి): మారుమూల పల్లెల్లో సైతం విద్యా భివృద్ధికి ప్రభుత్వం కృషివేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమ వారం హరిపురం ప్లస్‌ టూ హైస్కూల్‌లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు బావన దుర్యోధన, మాధవరావు, రుద్రయ్య, గున్నయ్య, వాసు, వైకుంఠరావు, తమిరి భాస్కరరావు, లచ్చయ్య పాల్గొన్నారు.

ఫ మందస,డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పంచాయతీలకు ప్రభుత్వం కావాల్సిన నిధులు మంజూరుచేయడంతో పల్లెలను అభివృద్ధిబాటలో నడిపించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. మందసలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

ఫపలాసరూరల్‌,డిసెంబరు15(ఆంధ్రజ్యోతి):కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థకు పెద్ద పీట వేస్తోందనిఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. బ్రాహ్మణతర్లా జడ్పీపాఠశాలలో ల్యాబ్‌భవనానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ చైర్మన్‌ పీరికట్ల విఠల్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, టీడీపీ మండలాధ్యక్షుడు కె.లక్ష్మ ణకుమార్‌, కార్యదర్శి దువ్వాడ సంతోష్‌, గంగారామ్‌, వడ్డి యాదగిరి పాల్గొన్నారు.

ఫపలాస, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి):అన్నీవార్డుల్లోను పూర్తిస్థాయి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మునిసిపాలిటీ లోని శివాజీనగర్‌లో సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు.కార్యక్రమంలో మునిసి పల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావుయాదవ్‌,గాలి కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 11:59 PM