Share News

నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - May 09 , 2025 | 11:41 PM

నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.శుక్రవారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదిగా నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయన్నారు.

నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం
నరసన్నపేట: మాట్లాడుతున్న బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, మే 9(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.శుక్రవారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదిగా నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషితో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.జిల్లాలో ఈఏడాది 1,327 మందికి ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు.కార్యక్రమంలో జిల్లా నైపుణాభివృద్ధి సంస్ధ, ప్రభుత్వ డిగ్రీ కళశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులకు పరామర్శ

పోలాకి,మే 9 (ఆంధ్రజ్యోతి): చెల్లాయివలసకు చెందిన టీడీపీ కార్యకర్త బట్న నరసయ్య మృతిచెందడంతో ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించారు.ఆయన వెంట ఎంవీనాయుడు, ఆర్‌కే నాయుడు, భాస్కరరావు ఉన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:41 PM