కూటమి ప్రభుత్వంతో మంచి రోజులు
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:58 PM
కూట మి ప్రభుత్వంతో రైతులకు మంచి రోజులు వచ్చా యని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నా రు.
ఎమ్మెల్యే గౌతు శిరీష
హరిపురం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వంతో రైతులకు మంచి రోజులు వచ్చా యని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నా రు. బాలిగాంలో గురువారం రైతులకు రాయితీ పై విత్తనాలు, పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం తపన పడేది ఒక్క సీఎం చంద్రబాబు మాత్రమేనని, రాయితీపై విత్త నాలు, పచ్చిరొట్ట, ఎరువులు, పనిముట్లను అందజేస్తున్నామని, వీటిని వినియోగించు కోవాలని కోరారు. మరో వారం రోజుల్లో రైతుభరోసాను రైతు ఖాతా ల్లో వేయను న్నట్లు చెప్పారు. ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పంట కాలువలు, నీటి వనరులను పునరు ద్ధరించే చర్యలు చేపడు తున్నామని, శివారు భూములకు సాగు నీరందించనున్నామన్నారు. అలాగే దున్నూరు, బాలిగాం గ్రామాల్లో వన మహో త్సవంలో భాగంగా మొక్కలు నాటా రు. కార్యక్రమంలో ఏంపీడీవో రమణమూర్తి, ఏడీఏ మధు, ఏవో నాగరాజు, ఏపీఎం హరికృష్ణ, టీడీపీ నాయకులు బావన దుర్యోధన, రట్టి లింగ రాజు, లబ్బ రుద్రయ్య, బమ్మిడి కర్రయ్య, తమిరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.