పార్వతీపురంలో ఫొటోషూట్కు వెళ్తూ..
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:15 AM
బూర్జ మండలం నీలంపేట జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.సంతోష్ (19) మృతి చెందినట్టు బూర్జ పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆమదాలవలస, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): బూర్జ మండలం నీలంపేట జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.సంతోష్ (19) మృతి చెందినట్టు బూర్జ పోలీసులు తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా గరివిడి మండలం పేరిపేట గ్రామానికి చెందిన సంతోష్ తన స్నేహితుడు, గాజువాకకు చెందిన నమ్మి కనకరాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వెళుతున్నాడు. ఫొటోగ్రాఫర్లు అయిన వీరు పార్వతీపురంలో ఓ ఫొటోషూట్ కోసం వెళ్తుండగా.. నీలంపేట జంక్షన్ వద్ద ప్రధాన రహదారిలో ఉన్న గోతులు తప్పించబోయి బైక్ అదుపు తప్పి పడిపోయారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక కూర్చున్న కనకరాజుకు తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
రణస్థలం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): సంచాం గ్రామానికి చెందిన ఎం.భాగ్యశ్రీ (14) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. భాగ్యశ్రీ తల్లి ఏడాది కిందట మృతి చెందింది. దీంతో భాగ్యశ్రీ కొన్నాళ్లగా మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం గడ్డిమందు తాగింది. వెంటనే స్థానికులు ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. భాగ్యశ్రీ ఒక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తండ్రి ఎం.రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.