ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి
ABN , Publish Date - May 16 , 2025 | 11:52 PM
: ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కుట్టుశిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తోందని నరసన్న పేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపా రు. శుక్రవారం దండులక్ష్మీపురం తుఫాన్ షెల్టర్లో 120 మంది మహిళలకు కుట్టుశిక్షణ పొందేలా మండలస్థాయి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
పోలాకి, మే 16(ఆంధ్రజ్యోతి): ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కుట్టుశిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తోందని నరసన్న పేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపా రు. శుక్రవారం దండులక్ష్మీపురం తుఫాన్ షెల్టర్లో 120 మంది మహిళలకు కుట్టుశిక్షణ పొందేలా మండలస్థాయి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కుట్టుశిక్షణ కేంద్ర కోర్డినేటర్ చంద్రశేఖర్, కుట్టుశిక్షకులు, వెలుగు ఏపీఎం రాజారావు, ఎంపీడీఓ రవికుమార్, ఎంవీనాయుడు, ఆర్కేనాయుడు, ఎస్ఎన్దాస్, డోలప్రసాదరావు, లావేటికృష్ణ పాల్గొన్నారు. తొలుత కేజీబీవీ గంగివలస నిర్మించిన అదనపు భవనానికి శంకుస్థాపన, గుప్పెడుపేట వైద్యశాల అదనపు భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ శశిబూషణరావు, ఎంపీడీవో రవికుమార్ పాల్గొన్నారు.