చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:14 AM
కేశవరావుపేట పంచాయతీ కింతల్లిమిల్లు జంక్షన్లో నివాసం ఉంటున్న కూటికుప్పల రత్నాలమ్మ (76) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది.
ఎచ్చెర్ల, జూలై 30(ఆంధ్రజ్యోతి): కేశవరావుపేట పంచాయతీ కింతల్లిమిల్లు జంక్షన్లో నివాసం ఉంటున్న కూటికుప్పల రత్నాలమ్మ (76) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొన్నే ళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రత్నాలమ్మ ఈనెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం రిమ్స్లో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకు ళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళ వారం మృతిచెందింది. రత్నాలమ్మ కుమారుడు దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వి.సందీప్కుమార్ తెలిపారు.