అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:45 PM
:అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా నని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి భరోసా ఇచ్చారు.
పోలాకి,జూలై24(ఆంధ్రజ్యోతి):అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా నని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి భరోసా ఇచ్చారు. గురువారంమబగాం పరిధిలోని కత్తెరవానిపేట క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వ హించారు. ఈ సందర్భంగా మబగాంలో లింగుబేరిభూలోకరావు కిడ్నీ వ్యాఽధి వైద్యఖర్చుల నిమిత్తం రూ.79,667 చెక్కు, అదేగ్రామానికి చెందిన లావేటి హర్షబ్రెయిన్ సర్జరీ కోసం రూ2,28,525లు, పందిరి నగేష్ అనారోగ్యం వల్ల వైద్యఖర్చుల కోసం రూ26218ల సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే అందజేశారు.కార్యక్రమంలో కాయరవి, గోవిందరావు, మెండరమణ, సీతారాం, వెలమల రామారావు పాల్గొన్నారు.