ఫిర్యాదుల పరిష్కారానికి కృషి: ఎస్పీ
ABN , Publish Date - May 09 , 2025 | 11:43 PM
:ప్రజాఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ లేకుండా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ మహే శ్వరరెడ్డి తెలిపారు.

పలాస,మే9(ఆంధ్రజ్యోతి):ప్రజాఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్ లేకుండా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ మహే శ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఆవరణలో ప్రజాఫిర్యాదులనమోదు,పరిష్కారవేదిక కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దనుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడారు. ఫిర్యాదుదారులు అర్జీలు,వారి వివరాలు కాశీబుగ్గ సబ్డివిజన్ పరిధిలో సంబంధిత పోలీసులు చర్యలు తీసుకొనిబాధితులకు న్యాయంచేయాలని ఆదేశించారుఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక ద్వారా పంపించాలని కోరారు.