కష్టపడేవారికి పార్టీలో తగిన గుర్తింపు
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:55 PM
పార్టీ కోసం కష్టపడేవారికి త గిన గుర్తింపు ఉంటుం దని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
రణస్థలం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడేవారికి త గిన గుర్తింపు ఉంటుం దని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నశలు పనిచేసేవారికి మంచి భవిష్యత్ ఉంటుందని, దానికి ఉదాహరణ తానేనని అన్నారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్ధలు ఉంటే అన్నదమ్ముల వలే పరిష్కరిం చుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడిగా లంక శ్యామలరావు, ప్రధాన కార్యదర్శిగా మండపాక కనకారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు డీజీఎం ఆనందరావు, పిసిని జగన్నాఽథంనాయుడు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గురజాపు రాము తదితరులు పాల్గొన్నారు.