ఎక్కువ కేసులు రాజీకి సహకరించండి
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:00 AM
రాజీ పడదగ్గ ఎక్కువ కేసులను జూలై 5న నిర్వహించనున్న లోక్అదాలత్లో పరిష్కరించేందుకు సహకరించాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు.
టెక్కలి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాజీ పడదగ్గ ఎక్కువ కేసులను జూలై 5న నిర్వహించనున్న లోక్అదాలత్లో పరిష్కరించేందుకు సహకరించాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు. శుక్రవారం స్థానిక కోర్టు సముదాయంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీమార్గమే రాజమార్గమని తెలిపారు. పోలీసులు, న్యాయవాదులు ఈ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సమా వేశంలో జూనియర్ సివిల్ న్యాయాధికారి మాధురి, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు పినకాన అజయ్కుమార్, న్యాయవాదులు, పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.