Share News

ఎమ్మెల్యే శిరీష పేరుతో వసూళ్లపై ఫిర్యాదు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:06 AM

తన పేరుతో వసూళ్లకు పాల్పడుతూ.. తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మె ల్యే గౌతు శిరీష కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే శిరీష పేరుతో వసూళ్లపై ఫిర్యాదు

పలాస, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): తన పేరుతో వసూళ్లకు పాల్పడుతూ.. తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మె ల్యే గౌతు శిరీష కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవా రం ఆ ఫిర్యాదు కాపీను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణకు అందించారు. ఎమ్మెల్యే పేరు చెబుతూ డీఎస్పీ అభ్యర్థులకు ఫోన్‌ చేసి ఉపాధ్యాయ పోస్టులు ఇప్పిస్తామని, అందుకు ముందుగా రూ.2100 ఫోన్‌పే ద్వారా చెల్లించాలని చెబుతున్నారని, దీనిపై దర్యాప్తు వసూళ్లకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:06 AM