సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
ABN , Publish Date - May 23 , 2025 | 12:24 AM
వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారు లకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అంద జేశారు.
పోలాకి/జలుమూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారు లకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అంద జేశారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అనా రోగ్యంతో బాధపడుతున్న చల్లబందకి చెందిన నిమ్మాడ శైలజ చికిత్స నిమిత్తం రూ.3,69,246, సొండిపేటకు చెందిన సేనాపతి ప్రభావతికి రూ.60 వేలు, జలుమూరు మండలం చల్లవానిపేటకి చెందిన దుంగ రత్నాలు మోకాళ్లు చికిత్సకు రూ.1.25 లక్షలు, తిలారు ఆర్ఎస్కి చెందిన పొట్నూరు అనంతరావు కిడ్నీ వ్యాధి చికిత్స కోసం రూ.1.57 లక్షల చెక్కులను అందించారు. కార్యక్రమంలో చల్లవానిపేట సర్పంచ్ పంచిరెడ్డి రామచంద్రరావు, టీడీపీ నేతలు బైరి భాస్కరరావు, తర్ర లక్ష్మీనారాయణ, అర్జాల విష్ణు, తవిటమ్మ, దుంగ స్వామిబాబు తదితరులు పాల్గొన్నారు.