Share News

రణస్థలంలో సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ బృందం

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:42 PM

సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్‌ ర్యాలీ బృందానికి సోమవారం రణస్థలంలో తహసీల్దార్‌ ఎన్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సీని యర్‌ కమాండెంట్‌ సతీష్‌కుమార్‌ బాజ్‌పే, డిప్యూటీ కమాండెంట్‌ వినీత్‌కుమార్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో 80 మంది సభ్యులకు రణ స్థలంలో స్థానికులు కుంకుమ దిద్ది హారతులిచ్చారు.

రణస్థలంలో సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ బృందం
సీఐఎస్‌ఎఫ్‌ బృందం నాయకుడికి సన్మానిస్తున్న అధికారులు

రణస్థలం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : సీఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్‌ ర్యాలీ బృందానికి సోమవారం రణస్థలంలో తహసీల్దార్‌ ఎన్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సీని యర్‌ కమాండెంట్‌ సతీష్‌కుమార్‌ బాజ్‌పే, డిప్యూటీ కమాండెంట్‌ వినీత్‌కుమార్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో 80 మంది సభ్యులకు రణ స్థలంలో స్థానికులు కుంకుమ దిద్ది హారతులిచ్చారు. ఈ సందర్భం గా సతీష్‌కుమార్‌ బాజ్‌పే మాట్లాడుతూ పశ్బిమబెంగాల్‌కు చెం దిన బృందాలు తొమ్మిది రాష్ట్రాల్లో 25 రోజుల పాటు పర్యటిస్తు న్నాయని తెలిపారు. 100 మంది సభ్యులు 6553 కిలో మీటర్ల మేర చేపట్టిన ర్యాలీ మార్చి 31న కన్యాకుమారిలో ముగిస్తుందని తెలిపా రు. మాదక ద్రవ్యాలరవాణా నిషేధం, అక్రమ ఆయుధాల నివారణ, తీవ్రవాదుల చొరబాటు నియంత్రణ, తీరప్రాంత భద్రత, మహిళా సాధికారత కోసం సీఐఎస్‌ఎఫ్‌ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమం లో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి, ఏఎస్‌ఐ రమణమూర్తి, నాయకులు లంక శ్యామలరావు, డీజీఎం ఆనంద రావు, పిసిని జగన్నాఽథం, పిన్నింటి వెంకటభానూజినాయుడు, కొమ ర లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 11:42 PM