Share News

మేథోశక్తిని పెంపొందించేందుకు చెస్‌ దోహదం

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:47 PM

విద్యార్థుల్లో మేఽథోశక్తిని పెంపొం దించేందుకు చెస్‌ పోటీ లు దోహదం చేస్తాయ ని చెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌ అన్నారు.

మేథోశక్తిని పెంపొందించేందుకు చెస్‌ దోహదం
విజేతలతో టీడీపీ నేత బాబ్జీ, నిర్వాహకులు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో మేఽథోశక్తిని పెంపొం దించేందుకు చెస్‌ పోటీ లు దోహదం చేస్తాయ ని చెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌ అన్నారు. నగరంలోని ఆదివారం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలబాలికల రాష్ట్రస్థాయి పోటీలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో చదరంగంపై ఆదరణ పెరి గిందన్నారు. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 12 విభాగాలకు చెందిన 116 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేత లకు టీడీపీ నేత చౌదరి బాబ్జీ సర్టిఫికెట్లు, జ్ఞాపి కలు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, సనప ల భీమారావు, సంఘం కార్యదర్శి జామి రమేష్‌, కేవీవీశర్మ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:47 PM