Share News

వేడుకగా జలయజ్ఞ శోభాయాత్ర

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:05 AM

: పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీరామ తారక మహా మంత్ర యజ్ఞం సందర్భం గా బెల్లుపడ గ్రామస్థులు శుక్రవారం జల యజ్ఞ శోభాయాత్రను ఘనంగా నిర్వ హించారు.

వేడుకగా జలయజ్ఞ శోభాయాత్ర
: కలశాలతో వెళుతున్న మహిళలు

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీరామ తారక మహా మంత్ర యజ్ఞం సందర్భం గా బెల్లుపడ గ్రామస్థులు శుక్రవారం జల యజ్ఞ శోభాయాత్రను ఘనంగా నిర్వ హించారు. బెల్లుపడ నుంచి వందలాది మంది మహిళలు బిందెలు పట్టు కొని బాహుదా నదీ జలాల కోసం మేళ తాళాలతో వెళ్లారు. అటు నుంచి తీసు కొచ్చిన నీటిని ఆలయం వద్ద భద్రపరి చారు. శనివారం త్రిదండి చిన్న శ్రీమన్నా రాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో జరగనున్న యజ్ఞంలో అభిషే కాలు, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకు రారోపణ, మృత్సంగ గ్రహణం, మండప ఆవాహనాలు, అగ్ని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు బెల్లుపడ గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు తెలిపారు. జలయాత్రలో ఎమ్మెల్సీ నర్తు రామారావు దంపతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:05 AM