వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:13 AM
కర్లపూడి గ్రామానికి చెందిన వివాహిత దూర్గాసి గీత అదృశ్యమై నట్టు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు.
నందిగాం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): కర్లపూడి గ్రామానికి చెందిన వివాహిత దూర్గాసి గీత అదృశ్యమై నట్టు వచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గీత ఈనెల 7వ తేదీ శుక్రవారం పెద్దతావరాప ల్లి బ్యాంక్కు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం ఆమె తండ్రి బు డ్డ లచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు.
అదృశ్యమైన గీత