ఘనంగా బసవేశ్వర జయంతి
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:50 PM
కుల, లింగ, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): కుల, లింగ, వర్ణ విభేదాలను వ్యతిరేకించిన మహాత్మా బసవేశ్వరుని తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో బసవేశ్వరుని జయంతిని ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి జేసీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దపు తత్వవేత్తగా బసవేశ్వరుడు సమానత్వాన్ని బోధించారని, అనునభవ మంటపం స్థాపించారని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.