Share News

సెల్‌ టవర్‌ ఎక్కి ఆటోడ్రైవర్‌ హల్‌చల్‌

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:03 AM

Auto driver up to cell tower ఎచ్చెర్ల మండలం కుశాలపురం పరిధిలోని యాతపేట వద్ద సెల్‌టవర్‌ ఎక్కి ఓ ఆటోడ్రైవర్‌ మంగళవారం హల్‌చల్‌ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15వేలు చొప్పున అందజేసిన విషయం తెలిసిందే.

సెల్‌ టవర్‌ ఎక్కి ఆటోడ్రైవర్‌ హల్‌చల్‌
సెల్‌ టవర్‌ ఎక్కిన ఆటోడ్రైవర్‌ కళ్యాణ్‌కుమార్‌

ప్రభుత్వ పథకం నిధులు అందలేదని ఆవేదన

ఎచ్చెర్ల, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం కుశాలపురం పరిధిలోని యాతపేట వద్ద సెల్‌టవర్‌ ఎక్కి ఓ ఆటోడ్రైవర్‌ మంగళవారం హల్‌చల్‌ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15వేలు చొప్పున అందజేసిన విషయం తెలిసిందే. కాగా.. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ దాసరి కళ్యాణ్‌కుమార్‌కు ఈ పథకం కింద నిధులు జమకాలేదు. ఈ నేపథ్యంలో కళ్యాణ్‌కుమార్‌ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో యాతపేట వద్ద సెల్‌టవర్‌ ఎక్కాడు. ఆటోడ్రైవర్లకు ఇచ్చే సాయం తనకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ నిధులు మంజూరుచేసే వరకూ దిగేది లేదంటూ సుమారు గంట సేపు హల్‌చల్‌ చేశాడు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్‌ఐ-2 వి.అప్పారావు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ‘ఆటోడ్రైవర్ల సేవలో’ డబ్బులు జమయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడతామని నచ్చజెప్పడంతో కళ్యాణ్‌కుమార్‌ టవర్‌ దిగాడు.

Updated Date - Nov 19 , 2025 | 12:03 AM