Share News

ఏపీఎంపై దాడి అమానుషం

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:31 PM

:అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మం డలం ఏపీఎం రజనీపై దాడిని ఇచ్ఛాపురం మండల వెలుగు సిబ్బంది ఖం డించారు.

  ఏపీఎంపై దాడి అమానుషం
సోంపేట: నిరసన తెలుపుతున్న వెలుగు సిబ్బంది

ఇచ్ఛాపురం, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి):అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మం డలం ఏపీఎం రజనీపై దాడిని ఇచ్ఛాపురం మండల వెలుగు సిబ్బంది ఖం డించారు.ఈ మేరకు ఇచ్ఛాపురంలో ఏపీఎం ప్రసాద్‌, జిల్లా ఏపీఎంల (సెర్ఫ్‌-డీఆర్‌డీఏ) సంక్షేమ సంఘ అధ్యక్షుల ఆధర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి దుశ్చర్యను సహించబో మని, అమానుషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘ అధ్యక్షులు ఎస్‌.ప్రసాద్‌, సీసీలు మోహన్‌రావు, దాలయ్య, అకౌంటెంట్లు మోహిని, వాణిభవాని, గ్రామ సంఘ సహాయకులు పాల్గొన్నారు.

ఫ సోంపేట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ఏపీఎం రజీనీపై దాడికి పాల్పడినవారిని శిక్షించాలని ఏపీఎం ఎస్‌.ప్రసా దరావు కోరారు. సోంపేటలో దాడికి నిరసనగా వెలుగు సిబ్బంది బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీసీలు జె.శ్రీనివాసరావు, బి.పాపారావు, పి.గణపతిరావు, టి.శ్రీనివాసరావు, భారితి, రాజేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:31 PM