Share News

ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:48 PM

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలతో వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు బొత్స సంతోష్‌, కొన్న శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ధర్నా నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలతో వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు బొత్స సంతోష్‌, కొన్న శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్‌ వద్ద మంగళవారం నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి అందించాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు హేమంత్‌, రామోజీ, కిషోర్‌, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:48 PM