Share News

అగ్నివీర్‌కు 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్‌

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:38 PM

నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు)కు చెందిన 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు అగ్ని వీర్‌కు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌, ఎన్‌సీసీ అధికారి డాక్టర్‌ యాళ్ల పోలి నాయుడు తెలిపారు.

అగ్నివీర్‌కు 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్‌
అగ్నివీర్‌కు ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ పోలినాయుడు

పాత శ్రీకాకుళం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు)కు చెందిన 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు అగ్ని వీర్‌కు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌, ఎన్‌సీసీ అధికారి డాక్టర్‌ యాళ్ల పోలి నాయుడు తెలిపారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న తరుణ్‌, కల్యాణ్‌తో పాటు ఎన్‌సీసీ బి,సి సర్టిఫి కెట్లు పొందిన విద్యార్థులు అగ్నివీర్‌కు ఎంపికైన వారిలో ఉన్నారన్నారు. దేశ రక్షణకు అవసరమైన శిక్షణకు త్వరలో వెళ్లనున్న విద్యార్థులను ఆయ న అభినందించారు. కార్యక్రమంలో 14వ ఆంధ్ర బెటాలియన్‌ ఎన్‌సీసీ అధికా రులు, సీఐ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 11:38 PM