జిల్లాకు 11 నూతన 108 వాహనాలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:06 AM
రణస్థలం, లావేరు మండలాల్లో వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలందించేం దుకు 108 వాహనాలు దోహదపడతాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. శుక్రవారం రణస్థలంలో అత్యాఽధునిక సాంకేతక పరిజ్ఞానంతో కూడిన రెండు 108 అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 108 అత్యవసరసేవల్లో భాగంగా జిల్లాకు 11నూతన 108 వాహనాలు కేటాయించినట్లు తెలిపారు.
రణస్థలం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రణస్థలం, లావేరు మండలాల్లో వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలందించేం దుకు 108 వాహనాలు దోహదపడతాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. శుక్రవారం రణస్థలంలో అత్యాఽధునిక సాంకేతక పరిజ్ఞానంతో కూడిన రెండు 108 అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 108 అత్యవసరసేవల్లో భాగంగా జిల్లాకు 11నూతన 108 వాహనాలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమం లో 108 జిల్లా సమన్వయకర్త ప్రకాష్, రీజినల్ మేనేజర్ ఎల్.నవీన్కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు.