Share News

Sri Chaitanya: శ్రీచైతన్య విజయకేతనం

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:02 AM

ఏపీ పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 599 మార్కులతో అగ్రస్థానంలో నిలవడంతో పాటు, 3836 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారని డైరెక్టర్‌ సీమ తెలిపారు.

Sri Chaitanya: శ్రీచైతన్య విజయకేతనం

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలలో తమ విద్యార్థులు విజయభేరి మోగించారని శ్రీచైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా 599 మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశామన్నారు. 598 ఆపైన మార్కులు నలుగురు, 597ఆపైన 28 మంది, 596 ఆపైన 81 మంది, 595 ఆపైన 156 మంది, 590 ఆపైన 1091 మంది, 580 ఆపైన మార్కులను 3836 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. శ్రీచైతన్య స్కూల్‌ సగటు మార్కు 513, పాస్‌ పర్జంటేజీ 99ు అని పేర్కొన్నారు. అత్యధిక బ్రాంచ్‌లు నూరుశాతం ఫలితాలు సాధించాయన్నారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి ఆమెతోపాటు సంస్థ మరో డైరెక్టర్‌ నాగేంద్ర అభినందనలు తెలిపారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 05:02 AM