Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వండి
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:33 AM
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిస్టలరీల నుంచి రూ.3,250 కోట్లు వసూలు చేసి, ఆ నిధుల దిశపై మరింత విచారణ జరిపించాలని కోరారు.
మద్యం ముడుపులు ఎక్కడికెళ్లాయో తేల్చాలి
ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు
విజయవాడ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు బుధవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత విచారణ చేయాల్సి ఉందని, కసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వైసీపీ హయాంలో రూపొందించిన మద్యం విధానంలో డిస్టలరీల నుంచి రూ.3,250 కోట్లు వసూలు చేశాడని తెలిపారు. ఈ నిధులు కసిరెడ్డి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..