దుకాణం దగ్ధం .. రూ.15 లక్షలు నష్టం
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:12 AM
స్థానిక వలీసాబ్ రోడ్డులోని ఫకృద్దీనకు చెందిన గెలాక్సీ మొబైల్షాపులో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఎప్పటిలాగానే ఆదివారం షాపు తెరచి టిఫెన చేయడానికి బయటకు వెళ్లారు.

కదిరి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): స్థానిక వలీసాబ్ రోడ్డులోని ఫకృద్దీనకు చెందిన గెలాక్సీ మొబైల్షాపులో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఎప్పటిలాగానే ఆదివారం షాపు తెరచి టిఫెన చేయడానికి బయటకు వెళ్లారు. ఈలోపు సెల్ఫోన షాపులో షార్ట్ షర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్ని మాపక సిబ్బంది వచ్చి ఆ మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల విలువ చేస్తే సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు ఫకృద్దీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బాధితుడ్ని పరామర్శించి, ఆదుకుంటామని హామీ ఇచ్చారు.