RTC bus crash: ఆర్టీసీ బస్సు బోల్తా.. కొబ్బరి చెట్టుతో తప్పిన పెనుప్రమాదం
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:26 AM
అనకాపల్లి జిల్లాలో రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బైక్ను తప్పించబోయి బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి, చెట్టు వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. టెక్కలి డిపో నుంచి ఉదయం 11గంటలకు 22మంది ప్రయాణికులతో బస్సు.. రాజమండ్రి బయలుదేరింది. ఎలమంచిలి మండలం పురుషోత్తపురం జంక్షన్ దాటిన కొద్దిసేపటికి అడ్డుగా వచ్చిన బైక్ను తప్పించ బోయి అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న రక్షణ స్తంభాలను ఢీకొని పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఓ కొబ్బరి చెట్టును ఢీకొని బోల్తాపడిన బస్సు.. మరో కొబ్బరి చెట్టు అడ్డుగా ఉండడంతో పల్టీలు కొట్టకుండా ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా.. మరికొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. - ఎలమంచిలి, ఆంధ్రజ్యోతి
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News