TDP: కలిసి నడవకపోతే కఠిన చర్యలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:53 AM
వారితో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చర్చలు జరిపారు.

మదనపల్లె ఎమ్మెల్యే, తెలుగు యువత
రాష్ట్ర అధ్యక్షుడిపై టీడీపీ అధిష్ఠానం సీరియస్
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మదనపల్లె నియోజకవర్గం టీడీపీ నాయకుల నడుమ విభేదాలు భగ్గుమన్నాయి. నాయకులు రోడెక్కడంపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబును తక్షణం పార్టీ కేంద్ర కార్యాలయానికి రప్పించారు. వారితో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చర్చలు జరిపారు. ఇద్దరు నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీని రోడ్డున పడేస్తుండటంపై ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందిస్తూ... ‘శ్రీరాం చినబాబు నాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేనన్న కనీస గౌరవం ఇవ్వడం లేదు’ అని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని శ్రీరాం చినబాబు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. విభేదాలను పరిష్కరించి, పరిస్థితిని చక్కదిద్దాలని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్రాజును పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఇద్దరు నేతల వాదనలు విన్న పార్టీ పెద్దలు.. ‘త్వరలో మదనపల్లె నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయండి. నియోజకవర్గంలో సీనియర్ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లండి’ అని ఎమ్మెల్యేకు సూచించారు. ఎమ్మెల్యేపై బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేయవద్దని శ్రీరాం చినబాబుకు సూచించారు. ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని, మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News