Share News

డ్రైనేజీల్లో పూడిక తొలగింపు

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:43 PM

స్థానిక స్పందన ఆస్పత్రి నుంచి లక్ష్మీచెన్నకేశవపురం వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ పూడుకుపోయింది. దీంతో వర్షాలు వచ్చినప్పుడల్లా మురుగునీరు రోడ్లపై పారుతూ తీవ్ర అసౌకర్యానికి కల్గించేది

డ్రైనేజీల్లో పూడిక తొలగింపు
డ్రైనేజీని శుభ్రం చేయిస్తున్న నాయకులు

ధర్మవరం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): స్థానిక స్పందన ఆస్పత్రి నుంచి లక్ష్మీచెన్నకేశవపురం వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ పూడుకుపోయింది. దీంతో వర్షాలు వచ్చినప్పుడల్లా మురుగునీరు రోడ్లపై పారుతూ తీవ్ర అసౌకర్యానికి కల్గించేది. ఈ పరిస్థితి ఐదేళ్లుగా ఉంది. ఈ విషయాన్ని స్థానికులు నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. దీంతో పూడి పోయిన ఆ డ్రైనేజీలను శుభ్రం చేయించేలా చూడాలని ఆ వార్డు టీడీపీ ఇనచార్జి భీమనేని ప్రసాద్‌నాయుడికి సూచించారు. ఆయన మున్సిపాలిటీ శానిటరీ ఇనస్పెక్టర్‌ కేశవ, సచివాలయ శానిటరీ సెక్రటరీ పుష్పరాజ్‌తో కలిసి.. సిబ్బందితో ఆ డ్రైనేజీల్లో పూడికను బుధవారం తొలగించారు.

Updated Date - Mar 05 , 2025 | 11:43 PM