APPSC Group1 scam: గ్రూపు-1 కేసులో మరొకరికి సంకెళ్లు
ABN , Publish Date - May 28 , 2025 | 04:49 AM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రశ్నాపత్రాల దిద్దుబాటులో రఘు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. కూలీలు, బిల్డింగ్ వర్కర్లను దిద్దుబాటు కోసం తీసుకురావడంలో రఘు ప్రధాన పాత్ర పోషించాడు.
కామ్సైన్ మధు సహాయకుడు రఘు అరెస్టు.. హైదరాబాద్లో అదుపులోకి
విజయవాడ, మే 27(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో పోలీసులు రఘు అనే వ్యక్తిని మంగళవారం అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన రఘు... కామ్సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ మధుసూదన్కు సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. హాయ్ల్యాండ్లో మాన్యువల్గా మూల్యాంకనం చేసినట్టుగా చూపించడానికి కొంతమంది వ్యక్తులను రఘు సరఫరా చేశారు. ఆక్కడ ఈ శిబిరం ప్రారంభమైన తర్వాత మధు అక్కడే బస చేసి మొత్తం ప్రక్రియను పరిశీలించేవారు. ఆయన హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఆ బాధ్యతలను రఘు నిర్వహించేవారు. మధు తన వ్యవహరాలను చక్కబెట్టుకోవడానికి రఘుతో పాటు గణేశ్ అనే వ్యక్తిని, నందిగామకు చెందిన ఇద్దరిని నియమించుకున్నారు. ఎక్కువ బాధ్యతలను రఘుకు అప్పగించారు. గ్రూప్-1 పేపర్లను దిద్దినట్లు సంతకాలు చేసిన కూలీలు, వెల్డర్లు, బిల్డింగ్ వర్కర్లను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి తరలించడంలో రఘు కీలకంగా వ్యవహరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News