Public Grievances: ఒంగోలులో అసంపూర్తి రోడ్లకు మోక్షం!
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:13 AM
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ జనవరి 28న ఒంగోలు 37వ డివిజన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి స్పందన లభిస్తోంది.

37వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
‘అక్షరం అండగా..’తో సమస్యకు పరిష్కారం
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారం కోసం ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ జనవరి 28న ఒంగోలు 37వ డివిజన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. అసంపూర్తిగా ఉన్న సిమెంట్ రోడ్ల పనులను బుధవారం రూ.10లక్షల మున్సిపల్ నిఽధులతో చేపట్టారు. రూ.10కోట్లతో డివిజన్లోని సమస్యలు పరిష్కారిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే డివిజన్లో దోమల నియంత్రణకు చర్యలు తీసుకోగా, పారిశుధ్యం మెరుగునకు, ఎన్టీఆర్ పార్కులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పార్కు నుంచి మంగమూరు డొంకకు గతంలో కొద్దిదూరం వేసి వదిలేసిన సీసీ రోడ్డును పూర్తిచేసే పనులను బుధవారం ప్రారంభించారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చొరవతో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News