Share News

Vivekananda Reddy: వివేకా హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:40 AM

ఆ హత్యలో భాగస్వామ్యం ఉన్న నిందితుల బెయిల్‌ రద్దయ్యే అవకాశం ఉంది’ అని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు.

Vivekananda Reddy: వివేకా హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది

నిందితుల బెయిల్‌ రద్దయ్యే అవకాశం ఉంది: బీటెక్‌ రవి

వేంపల్లె, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. ఆ హత్యలో భాగస్వామ్యం ఉన్న నిందితుల బెయిల్‌ రద్దయ్యే అవకాశం ఉంది’ అని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. బుధవారం ఆయన పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం ముసల్‌రెడ్డిగారిపల్లెలో మినీ గోకులం షెడ్డును ప్రారంభించి, మీడియాతో మాట్లాడారు. ‘వివేకా హత్య కేసుకు సంబంధించి అప్రూవర్‌గా మారిన దస్తగిరి వ్యవహారంపై ఎంపీ అవినాశ్‌రెడ్డి కోర్టులో కేసులో వేశారు. ఈ మేరకు కోర్టు నుంచి దస్తగిరికి, సీబీఐకి నోటీసులు వచ్చాయి. వివేకా కుమార్తె సునీత అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారు షరతులకు లోబడి ఉండాలి. ఇలాంటి బెదిరింపులకు దిగితే నిందితుల బెయిల్‌ రద్దయ్యే అవకాశం ఉంది’ అని రవి స్పష్టం చేశారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 04:40 AM