Share News

పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పిస్తాం

ABN , Publish Date - May 08 , 2025 | 10:45 PM

పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పించి, సకాలంలో అమ్మకాలు పూర్తి చేయించడానికి బోర్డు కృషి చేస్తుందని పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ అన్నారు. గురువారం పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆమె పొగా కు బోర్డు రైతులు, వ్యాపారులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం విలేక రులతో మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రం లో 160 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్ప త్తి లక్ష్యంగా కాగా, సుమారు 220 మిలియన్‌ కిలోలు రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు.

పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పిస్తాం
వ్యాపారులతో మాట్లాడుతున్న ఈడీ విశ్వశ్రీ

బోర్డు ఈడీ విశ్వశ్రీ

పొదిలి, మే 8 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పించి, సకాలంలో అమ్మకాలు పూర్తి చేయించడానికి బోర్డు కృషి చేస్తుందని పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ అన్నారు. గురువారం పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శించిన ఆమె పొగా కు బోర్డు రైతులు, వ్యాపారులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం విలేక రులతో మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రం లో 160 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్ప త్తి లక్ష్యంగా కాగా, సుమారు 220 మిలియన్‌ కిలోలు రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ధరల విషయమై వ్యాపారులతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. వ్యాపారులకు ఆర్డర్లు ఖరారు కావటానికి ఈ నెల మూడవ వారం వరకు సమ యం పడుతుందని చెప్తున్నారన్నారు. వాళ్లకు ఆర్డర్లు ఖరారైతే అన్ని రకాల బేళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు కంపెనీలు కొన్ని రకాల బేళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు కంపెనీలు కొన్ని రకాల బేళ్లను మాత్రమే కొనుగోలు చేయడం వలన తిరస్కరణ బేళ్లు ఎక్కువ అవుతున్నాయన్నారు. రానున్న 15 రోజులు పాటు నోబిడ్‌ బేళ్లను తగ్గించాలని వ్యాపారులను సూచించినట్లు చెప్పా రు. రైతు లు మార్కెట్‌లో ఏ రకం పొగాకును వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారో ఆ రకం బేళ్లను తెచ్చుకోవటం వలన అధనపు ఖర్చులు తగ్గుతాయన్నారు. గత ఏడాది అమ్మకాలు పూర్తయ్యేసరికి సరాసరి ధర రూ.230 వరకు వచ్చిందని ఈ ఏడాది ఇప్పటి వరకు సరాసరి ధర రూ. 30 అధనంగానే ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ధరలు తగ్గలేదన్నారు. కంపెనీలకు ఆర్డర్లు ఖరారైతే ధరలు పెరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. తద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. గతంలో రోజుకు మూడు మిలియన్‌ కిలోలు అమ్మకాలు జరిగేవని, పది రోజుల నుంచి రోజుకు ఆరు మిలియన్‌ కిలోల వరకు అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. రైతులు ఎక్కువ మొత్తంలో పంట పండించినప్పటికీ అక్టోబరు నాటికి అమ్మకాలు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కర్నాటకలో ఒక నెల ఆలశ్యంగా అమ్మకాలు పూర్తయినందున ఆంధ్రలో పూర్తి స్థాయి లో వ్యాపారులు, డీలర్లు రావడానికి నెలరోజులు సమయం పట్టిందని చెప్పా రు. ముందుగా వేలం కేంద్రం నిర్వాహణాధికారి గిరిరాజ్‌కుమార్‌తో ఈడీ మా ట్లాడారు. ఆమె వెంట బోర్డు అధికారి వేణుగోపాల్‌, ఒంగోలు ఆర్‌ఎం లక్ష్మణరావు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 08 , 2025 | 10:45 PM