డిప్యూటీ సీఎంపై దుష్ప్రచారం మానుకోవాలి
ABN , Publish Date - May 03 , 2025 | 10:23 PM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ పద్ధతిని మానుకోవాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ హితవు పలికారు. ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సాధి క్ మాట్లాడారు.
జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాధిక్
మార్కాపురం, మే 4 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ పద్ధతిని మానుకోవాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ హితవు పలికారు. ప్రెస్క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సాధి క్ మాట్లాడారు. ముస్లిం సమాజాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగ్రవాదులన్నారని వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పనిగట్టుకుని వైసీపీ నాయకులు ఇలా విషప్రచారంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. సనాతన ధర్మానికి కట్టుబడిన వ్యక్తి అయినా ఏనాడు పరమతాలను అవమానపరిచే విధంగా ప్రదర్తించలేదన్నారు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. సమావేశంలో సోను, రమేష్, పాపయ్య, చందు పాల్గొన్నారు.