Share News

మహిళల ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:06 PM

మహిళల ఆరోగ్యవంతంగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బీ మధు శంకర్‌ చెప్పారు.

మహిళల ఆరోగ్యవంతంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌ రవళి ప్రియాంక

వైద్యాధికారి బీ మధు శంకర్‌

ముండ్లమూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : మహిళల ఆరోగ్యవంతంగా జీవించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బీ మధు శంకర్‌ చెప్పారు. ఆయన శుక్రవారం మండలంలోని శంకరాపురంలో స్వస్థ్‌ నారి సశక్తి పరివార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌ కూరపాటి మహేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, నారాయణ స్వామి, రిటైర్డు ఎస్‌ఐ ఆంజనేయులు, హెచ్‌ఎం అరుణ కుమారి, సీహెచ్‌వో పాల్గొన్నారు.

బొద్దికూరపాడులో...

తాళ్లూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి) : తూర్పుగంగవరం పీహెచ్‌సీ వైద్యులు శ్రీకాంత్‌రెడ్డిఆధ్వర్యంలో బొద్దికూరపాడు గ్రామంలో స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మందా శ్యాంసన్‌, ఎంపీటీసీ సభ్యుడు బాలకోటయ్య, ఉపసర్పంచ్‌ పులి ప్రసాద్‌రెడ్డి, పోలంరెడ్డి రమణారెడ్డి, హెచ్‌ఎ్‌సవో చంద్రశేఖర్‌, పీహెచ్‌ఎన్‌ రమణమ్మ, హెచ్‌సీ సుశీల పాల్గొన్నారు.

పామూరులో...

పామూరు, సెస్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కుటుంబంలో మహిళా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే అందరికీ సురక్షితమని టీడీపీ నాయకులు యారవ శ్రీనివాసులు చెప్పారు. ఎర్రచేలు, ప్రభుత్వ పాఠశాలలో స్వస్థ్‌ నారీ - సశక్త్‌ పరివార్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ సుబ్బయ్య, టీడీపీ నాయకులు జయరామిరెడ్డి, నాగశేషు, సూపర్‌వైజర్‌ ఎంవీఎస్‌ పార్వతి పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:06 PM