Share News

బీసీల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - May 08 , 2025 | 10:42 PM

బీసీల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని రాష్ట్ర వాషర్‌మెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సావిత్రి చెప్పారు. స్థానిక పంచాయతీరాజ్‌ అతిథి గృహంలో రజకులు, రజక ఉద్యోగుల సమావేశంలో గురువారం ఆమె పాల్గొన్నారు.

బీసీల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
మాట్లాడుతున్న రాష్ట్ర వాషర్‌మెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ సావిత్రి

మార్కాపురం వన్‌టౌన్‌, మే 8 (ఆంధ్రజ్యోతి) : బీసీల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని రాష్ట్ర వాషర్‌మెన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సావిత్రి చెప్పారు. స్థానిక పంచాయతీరాజ్‌ అతిథి గృహంలో రజకులు, రజక ఉద్యోగుల సమావేశంలో గురువారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవో నెం.27 ప్రకారం ప్రభుత్వ వైద్యశాలల్లో, వివిధ శాఖల్లో దోబీ పోస్టులు రజకులకే ఇవ్వాలని చెప్పారు. దోబీలకు సంబంధించిన వివిధ కాంట్రాక్టులు కూడా వారికే ఇవ్వాలన్నారు. జీవో నెం.18 ప్రకారం మున్సిపాలిటీలు, 19 ప్రకారం పంచాయతీలలోని వాణిజ్య సముదాయాలలో 5 శాతం దుకాణాలు రజకులకే కేటాయించాలని చెప్పారు. రజకులకు ఐక్యంగా ఉండి అభివృద్ధికి సహకరించుకోవాలని, అప్పుడే ఆర్థికంగా, రాజకీయంగా రాణించగలరని సూచించారు. మానిటరింగ్‌ కమిటీతో రజకుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని రజకుల సమస్యలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం రజక సంఘ నాయకులు, ఉద్యోగులు సావిత్రిని సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కనిగిరి బాలవెంకటరమణ, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు తుంబేటి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి పెండ్యాల నారాయణ, రాష్ట్ర నాయకులు తిరుపతయ్య, రజక ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పేరూరి వెంకటేశ్వర్లు, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వక్కలగడ్డ మల్లికార్జునరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 10:42 PM