తహసీల్దార్ వర్సెస్ టీడీపీ నాయకులు
ABN , Publish Date - May 15 , 2025 | 12:21 AM
హసీల్దా ర్ వైసీపీ నాయకులకు మాత్రమే పనులు చే స్తున్నారు. వారికి మర్యాదలు చేసి పంపిస్తున్నా రు. వీఆర్వోలు డబ్బులు ఇస్తే గాని పనిచేయటం లేదు. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృ హం నిర్మించుకుందామన్నా పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఇప్పించలేకపోతున్నాం’’ అంటూ తెలు గుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధ్వజ మెత్తారు.
ఎమ్మెల్యే దామచర్ల ముందే వాగ్వాదం
రెవెన్యూ అధికారులు తమ పనులు చేయటం లేదంటూ ధ్వజం
కొత్తపట్నం, మే 14(ఆంధ్రజ్యోతి): ‘‘తహసీల్దా ర్ వైసీపీ నాయకులకు మాత్రమే పనులు చే స్తున్నారు. వారికి మర్యాదలు చేసి పంపిస్తున్నా రు. వీఆర్వోలు డబ్బులు ఇస్తే గాని పనిచేయటం లేదు. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృ హం నిర్మించుకుందామన్నా పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఇప్పించలేకపోతున్నాం’’ అంటూ తెలు గుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ధ్వజ మెత్తారు. టీడీపీ గ్రామ కమిటీలను ఏర్పాటు చే సేందుకు కొత్తపట్నం వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముందు తెలుగు తమ్ముళ్ళు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ నాయకులకు ఏ పని చేయడం లే దని, వైసీపీ వారికి మాత్రం ఏ పని అయినా చ కాచకా చేసేస్తున్నారంటూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల కిత్రం ఒంగోలు అర్బన్ కు బదిలీ అయిన తహసీల్దార్ మధుసూదనరా వు ఈ సమావేశంలో ఉండగా ఆయన పనితీ రుపై కూడా మండల టీడీపీ నాయకులు ఎక్కు వ మంది ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరా వు గౌడ్ తహసీల్దార్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీతో ఇరువురి మధ్య ఎమ్మెల్యే సమక్షం లో వాగ్వాదం జరిగింది. ‘నేను నీకేమి పని చేసి పెట్టలేదా’ అని తహసీల్దార్ మధుసూదనరావు రామచంద్రగౌడ్ను ప్రశ్నించగా ఒకటి అర ప నులు చేసి ప్రజల పనులన్నీ పెండింగ్లో పెట్టి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారంటూ గౌ డ్ ఎదురుదాడికి దిగారు. వాదన పెరుగుతుం డటంతో ఎమ్మెల్యే దామచర్ల కలగజేస్తున్నారు. రామచంద్ర గౌడ్ను సున్నితంగా మందలించా రు. ఇతర గ్రామ, మండల స్థాయి నాయకులు కూడా రెవెన్యూ అధికారులు తీరుపై దామచర్ల సమక్షంలోనే ఆవేదన వ్యక్తం చేశారు. తమ స మస్యలను ఎమ్మెల్యేకి విన్నవించారు. సమావేశం లో ఆర్డీవో లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఎన్నికల కా ర్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొన్నారు.