ప్రైవేటు స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టాలి
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:55 PM
జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠ శాలలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న పాఠ్యపుస్తకాల ఫీజులను అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ కోరారు.
పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 18 (ఆంధ్రజ్యో తి): జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠ శాలలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న పాఠ్యపుస్తకాల ఫీజులను అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ కోరారు. స్థానిక కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో కిరణ్కు మార్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అం దజేశారు. అనేక రకాల ఫీజుల భారంతో విద్యా ర్థుల తల్లిదండ్రులు ఆందోళణ చెందుతున్నార న్నారు. పుస్తకాలు, యూనిఫాం, షూల పేరుతో విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అదనంగా ఫీజులు వస్తున్నారని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో గుర్తింపు లేకు ండా అనేక పాఠశాలలు నడుస్తున్నాయని, వీ టన్నింటిపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీ సుకోవాలని డీఈవోను కోరారు. కార్యక్రమంలో నాయకులు వి.కోటి, వెంకట్రావు, సచిన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.