Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:01 AM

నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ప్రజా దర్బార్‌లో అర్జీలను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా నివేశన స్థలాలు - 80, పెన్షన్‌ - 45, రేషన్‌ కార్డులు - 25 అర్జీలు అందినట్లు చెప్పారు. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గంలో బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఈడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగే ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అర్జీదారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:01 AM