ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు గుణపాఠం
ABN , Publish Date - May 19 , 2025 | 10:43 PM
పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.
కనిగిరి, మే 19 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పామని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. అపరేషన్ సింధూర్ను ప్రయోగించి ప్రత్యర్ధి పాకిస్థాన్ ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర ఆధ్వర్యలో తిరంగా ర్యాలీ సోమవారం నిర్వహించారు. పామూరు బస్టాండు సెంటరులో జరిగిన మానవహారంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో ఇండియా వైపు కుట్రలు పన్నే ప్రతి ఒక్కరికి ఈ ఆపరేషన్ ఒణుకు పుట్టించేలా శ్రమించిన భారత త్రివిద దళాధిపతులకు, జవాన్లుకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డీవో, తహసీల్దార్ రవిశంకర్, మున్సిపల్ కమిషనర్ జోసఫ్దానియేలు, వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.