మార్కాపురం అభివృద్ధిని ఎవరూ ఆపలేరు
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:29 PM
మార్కాపురం అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక 27వ వార్డులోని దత్తసాయి గుడి వద్ద గురువారం రాత్రి మార్కాపురం జిల్లాకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
విమర్శలు చేసేవారికి ప్రజలే బుద్ధిచెబుతారు
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక 27వ వార్డులోని దత్తసాయి గుడి వద్ద గురువారం రాత్రి మార్కాపురం జిల్లాకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ జిల్లా ప్రకటనతో మార్కాపురం స్వరూపం పూర్తిస్థాయిలో మారిపోనుందని అన్నారు. ఇక్కడికి పలు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయన్నారు. ఒకప్పుడు మార్కాపురం స్థాయిలోదే ఒంగోలు అన్నారు. కానీ, జిల్లా ఏర్పాటు అయిన తర్వాత ఒంగోలు స్వరూపం మారిపోయిందన్నారు. ఇప్పటికే పలు వైద్యశాలలు, విద్యాసంస్థలు మార్కాపురం వచ్చేందుకు భూములు కూడా కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఇష్టంలేని ప్రతిపక్ష వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. వచ్చే సంవత్సరం వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం జిల్లా సుభిక్షంగా మారుతుందన్నారు. అభివృద్ధిని చేసేవాళ్లు ఎవరో, అడ్డుకునేది ఎవరో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వారే భవిష్యత్తులో ప్రతిపక్షానికి సరైన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీంఖాన్, కౌన్సిలర్లు కశ్శెట్టి నగేష్, చిన్న షెక్షావలి, టీడీపీ పట్టణ యూత్ అధ్యక్షుడు దొడ్డా దర్గే్షరెడ్డి, యలమంద తదితరులు పాల్గొన్నారు.