జీజీహెచ్లో న్యూరో శస్త్రచికిత్స విజయవంతం
ABN , Publish Date - May 10 , 2025 | 12:20 AM
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీ హెచ్)లో వెన్నెముక, న్యూరో ఆపరేషన్ విజ యంతంగా చేసినట్లు ఇన్చార్జి సూపరింటెండెం ట్ డాక్టర్ ఏడుకొండలు తెలిపారు.

ఇన్చార్జి సూపరింటెండెంట్ ఏడుకొండలరావు
ఒంగోలు కార్పొరేషన్, మే 9 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీ హెచ్)లో వెన్నెముక, న్యూరో ఆపరేషన్ విజ యంతంగా చేసినట్లు ఇన్చార్జి సూపరింటెండెం ట్ డాక్టర్ ఏడుకొండలు తెలిపారు. శుక్రవారం స్థానిక జీజీహెచ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగులుప్ప లపాడు మండలం రాపర్ల-మాచవరం గ్రామాని కి చెందిన వ్యక్తికి తలభాగం నుంచి వెన్నెము క వైపు వెళ్ళే నరంపై గడ్డ వచ్చింది. దీంతో బా ధితుడు ఏడాదిక కాలంగా అనేక ప్రైవేటు ఆసు పత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాలేద న్నారు. అయితే చివరకు ఆయన జీజీహెచ్కు విచ్చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహిం చి బాధితుడికి సీ3, సీ4 ట్యూమర్ ఉన్నట్లు గు ర్తించామన్నారు. అయితే ఎంతో ఖరీదైన, క్లిష్టతర మైన ఆపరేషన్ అయినప్పటికీ జీజీహెచ్ న్యూ రో సర్జరీ వైద్యులు విజయంతంగా నిర్వహించిన ట్లు చెప్పారు. వాస్తవానికి ఆసుపత్రిలో ఉన్న వ నరులు, వైద్య పరికరాలతో న్యూరో సర్జరీ స్పె షలిస్ట్ వైద్యులు గోపి, మురళీకృష్ణ, వలీ సం యుక్తంగా అరుధైన ఆపరేషన్ చేయడంతో రోగి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. జీజీహెచ్లో మెరుగైన శస్త్రచికిత్సలు చేస్తున్నామని, ప్రజలు ఆ యా సేవలను వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్ట ర్ నామినేని కిరణ్కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.