Share News

బిడ్డతో కాలువలోకి దూకిన తల్లి

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:07 AM

మండలంలోని మారెడ్డిపల్లికి చెందిన వి.గోవిందమ్మ బిడ్డతో సాగర్‌ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న దర్శి ఎస్‌ఐ ఎం.మురళి గమనించారు. కొందరు వ్యక్తుల సహాయంతో బయటకు తీసి కాపాడారు.

బిడ్డతో కాలువలోకి దూకిన తల్లి
చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న యువకుడు

కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం

కాపాడిన ఎస్‌ఐ మురళి

దర్శి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మారెడ్డిపల్లికి చెందిన వి.గోవిందమ్మ బిడ్డతో సాగర్‌ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న దర్శి ఎస్‌ఐ ఎం.మురళి గమనించారు. కొందరు వ్యక్తుల సహాయంతో బయటకు తీసి కాపాడారు. తల్లీబిడ్డను వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. భర్తతో విభేదం రావడంతో మనస్థాపానికి గురై గోవిందమ్మ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. తల్లీబిడ్డను కాపా డిన ఎస్‌ఐను పలువురు అభినందించారు.

Updated Date - Nov 20 , 2025 | 01:07 AM