అభయాంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు ఉగ్ర, నసీర్
ABN , Publish Date - May 22 , 2025 | 11:03 PM
మండలంలోని వెంగళాపురం సమీపంలో ఉన్న అభయాంజనేయస్వామిని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్అహ్మద్లు గురువారం ద ర్శించుకున్నారు. 36 అడుగుల అభయాంజనేయస్వామి ప్రాంగణంలో హ నుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న
ఎమ్మెల్యేలు ఉగ్ర, నసీర్
పీసీపల్లి, మే 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంగళాపురం సమీపంలో ఉన్న అభయాంజనేయస్వామిని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్అహ్మద్లు గురువారం ద ర్శించుకున్నారు. 36 అడుగుల అభయాంజనేయస్వామి ప్రాంగణంలో హ నుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దేవస్థాన చైర్మ న్ కొంపల్లి మాలకొండయ్య ఆహ్వానం మేరకు ఆంజనేయస్వామి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి, న సీర్ అహ్మద్, శాప్ చైర్మన్ రవినాయుడులు ధ్వజస్తంభం వద్ద కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థాన చైర్మన్ మాలకొం డయ్య వారిని సత్కరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించా రు. అభయాంజనేయస్వామిని దర్శించుకున్న వారిలో వెల్ది మాలకొండయ్య, కొంపల్లి మధు, మల్లికార్జున్, గుదే నాగేశ్వరరావు, వడ్డెంపూడి వెంకట్, చెరుకూరి సతీష్, రావి రాజా, ఏనుగంటి సోమయ్య, వేమూరి సుబ్బారావు తదితరులు ఉన్నారు.