ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:28 PM
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే అశోక్రెడ్డి
గిద్దలూరు టౌన్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భా గంగా ఆదివారం పట్టణంలోని 20వార్డు లోని ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే అశోక్రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అభివృద్ధి ప నులు, పథకాలపై కరపత్రాలను పంపిణీ చేస్తూ వివరించారు. ఎన్నికల ముందు ఇ చ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా మన్నా రు. కార్యక్రమంలో నాయకులు కావడి గు రయ్య, బద్రి బాషా, పట్టణపార్టీ అధ్యక్షుడు షానేషావలి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఏకలవ్యుడికి నివాళి
ఏ వ్యక్తి అయినా రాణించాలంటే దా నికి కృషి, పట్టుదల ఎంతో అవసరమని, దానికి నిదర్శనం ఏకలవ్యుడేనని, అందరికీ ఆదర్శమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యయలు, ఎమ్మెల్యే అశోక్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎస్టీ కాలనీలో ఏకలవ్యుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పా ల్గొన్న ఎమ్మెల్యే ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కొమరోలు : ఎమ్మెల్యే అశోక్రెడ్డితోనే అభివృద్ధి అని బాదినేనిపల్లి గ్రామ పంచాయతీ కోఆర్డినేటర్ ముత్తుముల యల్లారెడ్డి అన్నారు. మండలంలోని బాదినేనిపల్లి గ్రామ పంచాయతీలోని కృష్టంపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. కార్యక్రమంలో నాయకులు బద్రి లక్ష్మి రం గారెడ్డి, సారె వెంకట రమణ, గుడిమెళ్ల రామాంజనేయులు, రవి పాల్గొన్నారు.