Share News

వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 10:20 PM

పశ్చిమ ప్రకాశంలో శాశ్వతంగా కరువును నివారించడానికి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. బుధవా రం చాపలమడుగులో వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రైతులతో కలిసి సంతకాల సేకరణ, పోస్టు కార్డులపై వెలిగొండ పూర్తి చేయాలని రాసి సీఎం చంద్రబాబుకు పంపించారు.

వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి
పోస్టు కార్డులను చూపుతున్న రైతులు

తీగలేరును చిన్న కండ్లేరు వరకు పొడిగించాలి

సీఎంకు పోస్టు కార్డులు పంపిన రైతులు

పుల్లలచెరువు,జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రకాశంలో శాశ్వతంగా కరువును నివారించడానికి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. బుధవా రం చాపలమడుగులో వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రైతులతో కలిసి సంతకాల సేకరణ, పోస్టు కార్డులపై వెలిగొండ పూర్తి చేయాలని రాసి సీఎం చంద్రబాబుకు పంపించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోనే వెనుక బడిన పుల్లలచెరువు మండలంలో తాగు నీటీ కోసం 1000 అడుగులు బోర్లు తవ్వించినా నీరు లభ్యం కావడం లేదని, కరువు పోవాలంటే వెలిగొండ ప్రాజెక్టు తీగలేరు 5 కాలువను పుల్లలచెరువులోని చిన్న కండ్లేరు రిజర్వాయరు వరకు పోడగించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ సినీయరు నాయకుడు టీసీహెచ్‌ చెన్నయ్య, కృష్ణగౌడ్‌, మండల కార్యదర్శి జీవీ గురునాథం, జానకీ రఘు, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 10:20 PM