జీజీహెచ్లో క్యాన్సర్ నిర్ధారణ వైద్య పరికరం
ABN , Publish Date - May 27 , 2025 | 01:27 AM
ఒంగోలులోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అధునాతన ఇమ్యునోహిస్టో కెమిస్ట్రీ (ఐహెచ్సీ) పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు సోమవారం ప్రారంభించారు.
ప్రారంభించిన ఇన్చార్జి సూపరింటెండెంట్
ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని వెల్లడి
ఒంగోలు, కార్పొరేషన్, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అధునాతన ఇమ్యునోహిస్టో కెమిస్ట్రీ (ఐహెచ్సీ) పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ, దశ, చికిత్సలో ఈ పరికరం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వైద్య పీజీ కళాశాల నిధులు రూ.40లక్షలు వెచ్చించి దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఉచితంగా సేవలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్, హెచ్వోడీలు, డాక్టర్లు, సుధాకర్, దుర్గాదేవి, అటానమీ హెచ్వోడీ సుధాకర్బాబు పాల్గొన్నారు.