బర్లీ పొగాకును కొనుగోలు చేయాలి
ABN , Publish Date - May 10 , 2025 | 12:18 AM
బర్లీ పొగాకును కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులను ఆదుకో వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శు లు జె.జయంతిబాబు, పమిడి వెంకట్రావు డి మాండ్ చేశారు.

రైతు సంఘం డిమాండ్
నాగులుప్పలపాడు, మే 9 (ఆంధ్రజ్యోతి): బర్లీ పొగాకును కంపెనీలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులను ఆదుకో వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శు లు జె.జయంతిబాబు, పమిడి వెంకట్రావు డి మాండ్ చేశారు. బర్లీని పొగాకు కంపెనీలు కొను గోలు చేయాలని కోరుతూ రైతు, కౌలు రైతు సం ఘాల ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు బస్టాం డ్సెంటర్లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక ప్రై వేటు కంపెనీలు రైతులను ప్రోత్సహించి బర్లీ పొగాకు సాగు చేయించారన్నారు. ఉత్పత్తి ఎంత ఉన్నా కొనుగోలు చేస్తామని నమ్మబలికి తీరా పంట చేతికి వచ్చేసరికి కుంటి సాకులు చెబు తూ రైతులను నట్టేట ముంచారని ఆవేదన వ్య క్తం చేశారు. పండించిన పంటను నిల్వ చేసుకొ నే మార్గం లేక బర్లీ రైతులు అనేక ఇబ్బందులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం కంపెనీలతో బర్లీ పొగాకు కొనుగోలు చేయిం చడంతో విఫలమైందని ఆరోపించారు. కంటి తు డుపు మాటలతో సరిపెడుతుందే తప్పా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బర్లీ రైతుల సమస్యల ను పరిష్కరించలేదని దుయ్యబట్టారు. ఇప్పటి కైనా ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించి బర్లీ పొగాకును కొనుగోలు చేయాలని, లేకుంటే రైతు లతో కలిసి ఆందోళన చేపడతామని వారు హె చ్చరించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు తూబాటి శ్రీకాంత్, జి.బసవపున్న య్య, కాకాని సుబ్బారావు, పాలపర్తి యోనా, హ జరత్తయ్య, మండవ ఆంజనేయులు, పలు గ్రా మాల బర్లీ రైతులు పాల్గొన్నారు.