Share News

భైరవకోనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:06 AM

ప్రముఖ పర్యాటక శైవ రక్షేత్రమైన భైరవకోనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర, డాక్టర్‌ కవిత దంపతులు భైరవకోన క్షేత్రాన్ని బుధవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి 167-బి హైవేకు సంబంధించి పీడీఆర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ మస్తాన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లడ్‌ లైట్లను ప్రారంభించారు.

భైరవకోనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
భైరవకోన క్షేత్రంను దర్శించుకున్న ఎమ్మెల్యే ఉగ్ర దంపతులు

సీఎ్‌సపురం(పామూరు) నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ పర్యాటక శైవ రక్షేత్రమైన భైరవకోనను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర, డాక్టర్‌ కవిత దంపతులు భైరవకోన క్షేత్రాన్ని బుధవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి 167-బి హైవేకు సంబంధించి పీడీఆర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ మస్తాన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లడ్‌ లైట్లను ప్రారంభించారు. రాత్రిపూట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నిరోధించడానికి లైటింగ్‌ ఉపయోగపడుతుందన్నారు. అనంతరం దేవస్థానానికి విచ్చేసిన ఉగ్ర దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రీముఖ దుర్గాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారిని శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్ధప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమాల్లో డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి, జిల్లా షీప్‌ సొసైటీ ఛైర్మన్‌ తోడేటి గోపి, టీడీపీ మండల అధ్యక్షుడు బొబ్బూరి రాజేష్‌, మాజీ అధ్యక్షుడు బి. వెంగయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ సీహెచ్‌ వెంకట్‌రెడి, దేవస్థాన చైర్మన్‌ శ్యాంసుందర్‌రాజు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 12:07 AM